हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest Telugu News : Flipkart : ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ..

Sudha
Latest Telugu News : Flipkart : ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ..

ఫ్లిప్‌కార్ట్‌ను (Flipkart) నకిలీ కస్టమర్లు మోసగించారు. రూ.1.6 కోట్ల విలువైన 332 మొబైల్‌ ఫోన్లు చోరీ చేశారు. ఈ మోసాన్ని గ్రహించిన ఫ్లిప్‌కార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 8 నుంచి అక్టోబర్‌ 10 మధ్య నకిలీ చిరునామాలు, వేర్వేరు మొబైల్‌ నంబర్ల నుంచి రూ. 1.61 కోట్ల విలువైన 332 మొబైల్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో నిందితులు ఆర్డర్‌ చేశారు. ఖరీదైన ఆపిల్ ఐఫోన్, శామ్‌సంగ్ గెలాక్సీ, వివో, ఐక్యూవోవో మోడల్స్‌ ఇందులో ఉన్నాయి. కాగా, ఎర్నాకుళం జిల్లాలోని కంజూర్, కురుప్పంపడి, మెక్కడ్, మువట్టుపుళలోని ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ హబ్స్‌ నుంచి 332 మొబైల్‌ ఫోన్స్‌ డెలివరీ అయ్యాయి. కంజూర్ హబ్ నుంచి రూ. 18.14 లక్షల విలువైన 38 ఫోన్లు, కురుప్పంపడి హబ్ నుంచి రూ. 40.97 లక్షల విలువైన 87 ఫోన్లు, మెక్కడ్ హబ్ నుంచి రూ. 48.66 లక్షల విలువైన 101 ఫోన్లు, మువట్టుపుళ హబ్ నుంచి రూ. 53.41 లక్షల విలువైన 106 ఫోన్‌ ఆర్డర్లు వచ్చాయి. అయితే డెలివరీ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఆ మొబైల్‌ ఫోన్స్‌ అన్ని మాయమయ్యాయి.

Read Also : NVS: కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో జాబ్ నోటిఫికేషన్

Flipkart
Flipkart

మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఈ మోసాన్ని గ్రహించారు. రూ. 1.61 కోట్ల విలువైన 332 మొబైల్‌ ఫోన్స్‌ మిస్సింగ్‌పై ఎర్నాకుళం రూరల్‌ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంజూర్, కురుప్పంపడి, మెక్కడ్, మువట్టుపుళ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిద్ధిక్‌ కే అలియార్, జాస్సిమ్ దిలీప్, హరిస్ పీఏ, మహిన్ నౌషాద్‌లపై పోలీసులు చీటింగ్‌, ఫోర్జరీ, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

ఫ్లిప్కార్ట్ ఏ దేశ కంపెనీ?

ఫ్లిప్‌కార్ట్ ఇంక్. ఒక భారతీయ ఇ-కామర్స్ కంపెనీ, దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది మరియు సింగపూర్‌లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా విలీనం చేయబడింది.

ఫ్లిప్కార్ట్ రెవెన్యూ?

ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ₹20,746 కోట్లు ఆదాయం ఆర్జించిందని, గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 14% ఎక్కువ” అని ఫ్లిప్‌కార్ట్ స్వతంత్ర పనితీరుపై టోఫ్లర్ చెప్పారు. ఈ-కామర్స్ సంస్థ 2024 ఆర్థిక సంవత్సరంలో ₹18,187.7 కోట్ల స్వతంత్ర ఆదాయాన్ని నమోదు చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870