జైపూర్ లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జైపూర్ సమీపంలోని చక్సూ ప్రాంతంలో ఉన్న టైగేరియా మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ఐదుగురు మృతి చెందారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి జైపూర్ (Jaipur) కు వస్తుండగా ఉదయం సుమారు 5:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతదేహాలను చక్సూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: PM Modi On Pulwama Attack : పుల్వామా వీరులకు నివాళులర్పించిన పీఎం మోదీ
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: