Farmers welfare budget : కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు మార్కెట్లో అధిక విలువ కలిగిన పంటల సాగును ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు సబ్సిడీలు అందిస్తామని చెప్పారు. జీడిపప్పు, కోకో, బాదం, పైన్నట్స్ వంటి వాణిజ్య పంటలకు ప్రత్యేక పథకాలు తీసుకురానున్నారు.
Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
అదేవిధంగా దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని అభివృద్ధి చేసి మత్స్యకారులకు ఆదాయం పెంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పశు సంవర్థక రంగానికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పాల ఉత్పత్తి, పశు ఆధారిత ఉపాధికి మరింత మద్దతు అందిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్ రైతులకు నిజమైన తీపి కబురుగా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: