📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో నకిలీ గుండె వైద్యుడి నిర్వాకం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 5, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ నకిలీ వైద్యుడి నిర్వాకం వల్ల ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఎన్‌ జాన్‌ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు దమోహ్‌ పట్టణంలో ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు అతడు వైద్యుడే కాదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎన్‌ జాన్‌ కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్‌ వైద్యుడి పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్టుగా చలామణి అవుతున్నట్లు తెలిపారు.ః

నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిపారు. అతడు చేసిన ఆపరేషన్లకు ఆస్పత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు బ్రిటన్‌లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకొని వైద్యుడిగా కొనసాగుతున్నాడని అన్నారు. హైదరాబాద్‌లోనూ అతడిపై పలు కేసులు నమోదయినట్లు గుర్తించామన్నారు. మృతులు ఏడుగురు అని బాధితులు చెప్తున్నప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Read Also: రేపు అయోధ్యలో అద్భుత ఘట్టం.. రామయ్య నుదుటిపై సూర్య తిలకం

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Madhya Pradesh Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.