📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pension :ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం

Author Icon By Anusha
Updated: March 21, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హామీతో కూడిన పెన్షన్ అందించే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్ ) ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే కాకుండా కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులు కూడా ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఏ) విడుదల చేసింది.యూపిఎస్ ద్వారా 23 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (ఓ పిఎస్) తరహాలో హామీతో కూడిన పెన్షన్ అందించబడుతుంది. 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పిఎస్ ) కింద ఉన్నప్పటికీ, అందులో ఫిక్స్ డ్ పెన్షన్ లేకపోవడంతో పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపిఎస్) ని అమలు చేయాలని నిర్ణయించింది.

యూపిఎస్ లో చేరే విధానం

యూపిఎస్ ప్రస్తుత ఉద్యోగులు.
2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులు, ఎన్ పిఎస్ ను సెలెక్ట్ చేసుకున్న వారు యూపిఎస్ లో చేరవచ్చు.యూపిఎస్ లో చేరాలంటే ఫారం ఏ2 నింపి సమర్పించాలి.

కొత్తగా నియమితులు

2025 ఏప్రిల్ 1 లేదా ఆ తరువాత సర్వీసులో చేరిన కొత్త ఉద్యోగులు ఈ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇందుకు వీరు ఫారం ఏ1 నింపాలి.

రిటైర్డ్ ఉద్యోగులు,

ఎన్ పిఎస్ కింద పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా యూపిఎస్లో చేరవచ్చు.ఇందుకు కెవైసి డాక్యుమెంట్స్‌తో పాటు ఫారం బి2ని సమర్పించాలి.

ఉద్యోగి మరణించిన సందర్భంలో

ఉద్యోగి మరణించిన సందర్భంలో, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి యూపిఎస్ లో చేరవచ్చు.కెవైసి పత్రాలు, ఫారం బి6 సమర్పించాలి.

స్వచ్ఛంద పదవీ విరమణ

యూపిఎస్ లో విఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు 25 సంవత్సరాల సర్వీసు నిబంధన వర్తిస్తుంది.
వీరికి 60 ఏళ్లు నిండే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

యూపిఎస్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

అన్ని వర్గాల ఉద్యోగులకు రిజిస్ట్రేషన్, క్లెయిమ్ ఫారాల భర్తీ ప్రక్రియ సిఆర్ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది:సిఆర్ఏ వెబ్‌సైట్ఆన్‌లైన్ లేదా భౌతికంగా ఫారం సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది.

యూపిఎస్ లో చేరలేని ఉద్యోగులు

తొలగింపు, రాజీనామా, లేదా సర్వీసు రద్దు అయిన ఉద్యోగులు ఈ పథకంలో చేరలేరు.
ఇప్పటికే ఎంపిక చేసుకున్న పెన్షన్ స్కీమ్ మార్చుకునే అవకాశం లేదు.

యూపిఎస్ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు

ఫిక్స్డ్ పెన్షన్ హామీతో ఉద్యోగ భద్రత పెరుగుతుంది.ఎన్ పిఎస్ కంటే అధిక స్థాయిలో ప్రభుత్వ సహకారం అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ప్రభుత్వ మొత్తం సహకారం 28.5% ఉండటంతో పథకం మరింత స్థిరంగా ఉంటుంది.సేవకాలం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది,కుటుంబానికి కూడా పెన్షన్ అందించే విధానం ఉంది.

#CentralGovernment #GovernmentEmployees #IndianGovernment #UnifiedPensionScheme #UPS Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.