దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల EPS పెన్షనర్లు(EPS Pensions) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే సమాచారమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ముందే పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా EPS–1995 పథకం కింద లభించే కనీస పెన్షన్ను భారీగా పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం EPS కింద నెలకు కనీసంగా రూ.1,000 పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని వివిధ ట్రేడ్ యూనియన్లు కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇటీవల జరిగిన ప్రీ-బడ్జెట్(Pre-budget) చర్చల్లో కూడా పెన్షన్ను రూ.9,000 వరకు పెంచాలని బలంగా డిమాండ్ చేశారు. దాంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనలో పెట్టినట్లు సమాచారం.
Read Also: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్
ఈ పెంపు అమల్లోకి వస్తే పెన్షన్(EPS Pensions) మొత్తం 800% పెరిగినట్లవుతుంది. పెన్షన్ను రూ.9,000కు పెంచడమే కాకుండా, దీనిని డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance)కు అనుసంధానం చేయాలన్న సూచన కూడా యూనియన్ల నుంచి వెళ్లింది. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్ కూడా స్వయంచాలకంగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ పెంపు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వృద్ధ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక లాభం చేకూరుతుంది. వైద్య ఖర్చులు, జీవితావసర పరమైన రోజువారీ ఖర్చులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రం దీనిపై సానుకూలంగా ఉందన్న సమాచారం వస్తోంది. రాబోయే బడ్జెట్ లేదా అంతకంటే ముందే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: