📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: EPS Pensions: పెన్షనర్లకు భారీ బెనిఫిట్: 800% పెరిగే EPS పెన్షన్

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సుమారు 65 లక్షల EPS పెన్షనర్లు(EPS Pensions) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే సమాచారమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ముందే పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా EPS–1995 పథకం కింద లభించే కనీస పెన్షన్‌ను భారీగా పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం EPS కింద నెలకు కనీసంగా రూ.1,000 పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని వివిధ ట్రేడ్ యూనియన్లు కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇటీవల జరిగిన ప్రీ-బడ్జెట్(Pre-budget) చర్చల్లో కూడా పెన్షన్‌ను రూ.9,000 వరకు పెంచాలని బలంగా డిమాండ్‌ చేశారు. దాంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనలో పెట్టినట్లు సమాచారం.

Read Also: Vande Bharat : డిసెంబర్ 10 నుంచి వందే భారత్.. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు

Huge benefit for pensioners EPS pension to increase by 800%

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్

ఈ పెంపు అమల్లోకి వస్తే పెన్షన్(EPS Pensions) మొత్తం 800% పెరిగినట్లవుతుంది. పెన్షన్‌ను రూ.9,000కు పెంచడమే కాకుండా, దీనిని డియర్‌నెస్ అలవెన్స్‌ (Dearness Allowance)‌కు అనుసంధానం చేయాలన్న సూచన కూడా యూనియన్ల నుంచి వెళ్లింది. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెన్షన్ కూడా స్వయంచాలకంగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ పెంపు అమలైతే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వృద్ధ పెన్షనర్లకు పెద్ద ఎత్తున ఆర్థిక లాభం చేకూరుతుంది. వైద్య ఖర్చులు, జీవితావసర పరమైన రోజువారీ ఖర్చులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రం దీనిపై సానుకూలంగా ఉందన్న సమాచారం వస్తోంది. రాబోయే బడ్జెట్ లేదా అంతకంటే ముందే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Central Budget Employees Pension Scheme EPS 1995 EPS pension Minimum pension hike Pension increase proposal Pensioners news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.