📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏటీఎం, యూపీఐ(UPI) ద్వారా పీఎఫ్ సొమ్ము తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

Read Also: Lenovo: భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

పీఎఫ్ ఉపసంహరణలో విప్లవాత్మక మార్పు

ఈ అంశంపై తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. పీఎఫ్ నిధులు పూర్తిగా ఉద్యోగులవేనని పేర్కొన్న మంత్రి, వాటి ఉపసంహరణలో ఉన్న క్లిష్టమైన ప్రక్రియలను సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండానే పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు.

EPFO: PF withdrawal through ATM, UPI to come into effect next March

ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్

ఏటీఎం(ATM) ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని గుర్తుచేశారు.

అయితే ఇప్పటికే ఆధార్, యూఏఎన్ వంటి వివరాలు అనుసంధానమై ఉన్న నేపథ్యంలో, పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా నేరుగా నగదు ఉపసంహరణ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఉద్యోగులకు పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ATM PF Withdrawal EPFO EPFO News mansukh mandaviya PF withdrawal UPI PF Facility

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.