గత కొన్ని(Employees) వారాలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొన్న అనిశ్చితి 8వ వేతన సంఘం ప్రస్థావనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో తొలగించబడింది. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పాటవ్వడం తప్పనిసరి, ఈ ఏడాదికి 7వ వేతన సంఘం ముగియాల్సిన తర్వాత 8వ వేతన సంఘం ఏర్పాటవ్వాల్సింది. అయితే, దాని అమలు కొంత ఆలస్యమైంది.
Read also: ఢిల్లీ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిన ఇండిగో సంక్షోభం..
జీతాలు, పెన్షన్లపై కమిషన్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వం(Government) తెలిపిన వివరాల ప్రకారం, 8వ వేతన సంఘం సిఫార్సులు జీత నిర్మాణం మాత్రమే కాకుండా పెన్షన్లకు(Employees) కూడా వర్తిస్తాయి. ఉద్యోగి సంఘాలు గతంలో పెన్షన్ల స్పష్టత కోసం మాకు లేఖలు రాశాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించిన ప్రకారం, 8వ వేతన సంఘం విస్తృతమైనది మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లను సమీక్షిస్తుంది. కమిషన్ తన నివేదికలో పెన్షన్లను ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇందులో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ పెన్షనర్ల డీయర్నెస్ రిలీఫ్ ను బేసిక్ పేలో విలీనం చేయడానికి ప్రస్తుతం ప్రస్తావన లేదు. అంటే, పాత జీత గణన విధానం తాత్కాలికంగా కొనసాగుతుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ సిఫార్సులను ఎదురుచూస్తూ ఉంటారు, అయితే వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత జీతాలు మరియు పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల సాధ్యమే అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: