Elvish Yadav: వినోదం కోసం పాములను ఉపయోగించే ఘటనలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబర్, బిగ్బాస్ విజేత ఎల్విష్ యాదవ్ తనపై నమోదైన కేసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాములతో ఆటలాడటం నేరమా కాదా అని ప్రశ్నిస్తూ, సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తే సమాజానికి తప్పు సందేశం వెళ్తుందని హెచ్చరించింది.
Read Also: EAPCET 2026 : ఎప్సెట్లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!
అసలు పాము విషాన్ని ఎలా సేకరిస్తారు? రేవ్ పార్టీల్లో దానిని వినోదం కోసం ఎలా ఉపయోగిస్తారు? అసలు భయం లేకుండా వాటిని ఎలా పట్టుకుంటారు? అనే విషయాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. గతంలో ట్రయల్ కోర్టులో ఎల్విష్పై జరుగుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేసు ఏమిటి?
2023 నవంబర్లో నోయిడాలో జరిగిన ఒక రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారనే ఆరోపణలపై ఎల్విష్ యాదవ్పై కేసు నమోదు అయింది. ఈ కేసులో 2024 మార్చి 17న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛార్జిషీటులో విదేశీయులు కూడా ఈ పార్టీల్లో పాల్గొని పాము విషాన్ని మత్తు కోసం వాడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: