2026 సంవత్సరం(Elections2026) భారత రాజకీయాల్లో కీలకంగా మారనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి జోరుగా సాగనుంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఇది ఓ కీలక పరీక్షగా మారబోతోంది.
Read Also: Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పరుగులు పెడుతుందో తెలుసా ?
రాష్ట్రాలవారీగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. ఇక తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఎన్నికల లెక్కలు పూర్తిగా మారుతున్నాయి. ఆయన ఎంట్రీతో ప్రధాన పార్టీల వ్యూహాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కేరళలో ఇప్పటివరకు బలంగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు(Elections2026) సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో స్థానిక నాయకులకు ఇవి అగ్నిపరీక్షగా మారనున్నాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికలు కూడా ఈ ఏడాది రాజకీయంగా హాట్ టాపిక్గా నిలవనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: