📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం

Author Icon By Sudha
Updated: September 17, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission)కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటో (Candidate’s color photograph)లను ముద్రించనున్నారు. అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా, ఫొటో కోసం కేటాయించిన స్థలంలో మూడింట ఒక వంతు ముఖానికి కేటాయిస్తారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.

Election Commission: ఇక నుంచి ఈవీఎంలపై అభ్యర్ధి కలర్‌ ఫోటోలు..ఎన్నికల సంఘం


ఈవీఎంలపై గత కొంతకాలంగా విస్తృత చర్చ నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం అటువంటిది ఏంలేదని కొట్టిపారేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Commission)కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్ధి కలర్‌ ఫోటోలను ముద్రించనున్నారు. అభ్యర్థి ముఖం మరింత స్పష్టంగా కనిపించేలా, ఫొటో కోసం కేటాయించిన స్థలంలో మూడింట ఒక వంతు ముఖానికి కేటాయిస్తారు. ఈ మార్పులు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల ఓటర్లకు పోలింగ్ బూత్‌లో గందరగోళం లేకుండా, తాము ఎంచుకున్న అభ్యర్థికి సులభంగా ఓటు వేయడం సాధ్యమవుతుంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, ఓటర్లకు అనువుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్ (Election Commission)తెలిపింది.

భారత ఎన్నికల సంఘం అంటే ఏమిటి?

భారత ఎన్నికల కమిషను, స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.

ఎన్నికల కమిషను వ్యవస్థ గురించి?

దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/india-is-pushing-ahead-despite-us-tariffs/national/549173/

Breaking News candidate photos color photos on EVM Election Commission evm Indian Elections latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.