📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Author Icon By Sudheer
Updated: February 2, 2025 • 9:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఢిల్లీ చేరుకుని, తెలుగు వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అనంతరం తన అధికారిక నివాసమైన 1 జన్‌పథ్‌కి వెళ్లి, అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలకు పయనమయ్యారు.

ప్రచారం సందర్భంగా చంద్రబాబు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తాగు నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలో ఘోరమైన వైఫల్యం చూపిందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని, అయితే ఆప్ ప్రభుత్వం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోలేకపోతోందని విమర్శించారు.

యమునా నది పరిశుభ్రత విషయంలో కూడా చంద్రబాబు ఆప్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు. పదేళ్లుగా యమునా నది శుద్ధి చేయాలని చెబుతున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని, నిజంగా నది ప్రక్షాళన చేయాలంటే అది మోదీకే సాధ్యమని తెలిపారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొనాలంటే బీజేపీ ప్రభుత్వమే ఉత్తమ మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ప్రజలకు సేవ చేసేవారు, అభివృద్ధి కోసం కృషి చేసేవారే అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “ప్యాలెస్‌లు కట్టుకునే నాయకులు కాదు, ప్రజల కోసం పని చేసే నాయకులు అవసరం. అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటేయండి,” అని హితవు పలికారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌ గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని విశ్వసించి గెలిపించారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి బాటలు వేసినట్టు వివరించారు. ఢిల్లీలోనూ ప్రజలు మంచి పాలన కోరుకుంటే, డబుల్ ఇంజిన్ సర్కారుకే మద్దతు తెలపాలని చంద్రబాబు ప్రజలను కోరారు.

Chandrababu Delhi Elections Google news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.