हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Sudheer
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఢిల్లీ చేరుకుని, తెలుగు వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అనంతరం తన అధికారిక నివాసమైన 1 జన్‌పథ్‌కి వెళ్లి, అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలకు పయనమయ్యారు.

ప్రచారం సందర్భంగా చంద్రబాబు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తాగు నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలో ఘోరమైన వైఫల్యం చూపిందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని, అయితే ఆప్ ప్రభుత్వం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోలేకపోతోందని విమర్శించారు.

యమునా నది పరిశుభ్రత విషయంలో కూడా చంద్రబాబు ఆప్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు. పదేళ్లుగా యమునా నది శుద్ధి చేయాలని చెబుతున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని, నిజంగా నది ప్రక్షాళన చేయాలంటే అది మోదీకే సాధ్యమని తెలిపారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొనాలంటే బీజేపీ ప్రభుత్వమే ఉత్తమ మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ప్రజలకు సేవ చేసేవారు, అభివృద్ధి కోసం కృషి చేసేవారే అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “ప్యాలెస్‌లు కట్టుకునే నాయకులు కాదు, ప్రజల కోసం పని చేసే నాయకులు అవసరం. అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటేయండి,” అని హితవు పలికారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌ గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని విశ్వసించి గెలిపించారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి బాటలు వేసినట్టు వివరించారు. ఢిల్లీలోనూ ప్రజలు మంచి పాలన కోరుకుంటే, డబుల్ ఇంజిన్ సర్కారుకే మద్దతు తెలపాలని చంద్రబాబు ప్రజలను కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

AI ని నమ్ముకొని ప్రాణాలమీదకు తెచ్చుకున్న డాక్టర్

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బెంగాల్‌లో బీజేపీ వస్తే 45 రోజుల్లో కంచె, అమిత్ షా షాక్!

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

బడ్జెట్ కు ముందు అల్వా వేడుక ఎందుకు చేస్తారు ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

రేపే బడ్జెట్.. వీటి ధరల్లో మార్పు ఉండబోతుందా ?

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

‘బ్లాక్ బడ్జెట్’, ‘డ్రీమ్ బడ్జెట్’ల గురించి తెలుసా?

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

ఎన్సీపీ విలీనంపై శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870