हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Sudheer
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఢిల్లీ చేరుకుని, తెలుగు వాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అనంతరం తన అధికారిక నివాసమైన 1 జన్‌పథ్‌కి వెళ్లి, అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలకు పయనమయ్యారు.

ప్రచారం సందర్భంగా చంద్రబాబు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తాగు నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనలో ఘోరమైన వైఫల్యం చూపిందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని, అయితే ఆప్ ప్రభుత్వం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోలేకపోతోందని విమర్శించారు.

యమునా నది పరిశుభ్రత విషయంలో కూడా చంద్రబాబు ఆప్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు. పదేళ్లుగా యమునా నది శుద్ధి చేయాలని చెబుతున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని, నిజంగా నది ప్రక్షాళన చేయాలంటే అది మోదీకే సాధ్యమని తెలిపారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొనాలంటే బీజేపీ ప్రభుత్వమే ఉత్తమ మార్గమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ప్రజలకు సేవ చేసేవారు, అభివృద్ధి కోసం కృషి చేసేవారే అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “ప్యాలెస్‌లు కట్టుకునే నాయకులు కాదు, ప్రజల కోసం పని చేసే నాయకులు అవసరం. అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటేయండి,” అని హితవు పలికారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌ గెలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని విశ్వసించి గెలిపించారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి బాటలు వేసినట్టు వివరించారు. ఢిల్లీలోనూ ప్రజలు మంచి పాలన కోరుకుంటే, డబుల్ ఇంజిన్ సర్కారుకే మద్దతు తెలపాలని చంద్రబాబు ప్రజలను కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870