దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు(Strict actions) తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీల నమోదును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
నిబంధనలు ఉల్లంఘించడంపై చర్యలు
ఇందులో భాగంగా మొదటి దశలో ఆగస్టు 9వ తేదీన 334 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. రెండో దశ చర్యల్లో భాగంగా, శుక్రవారం మరో 474 పార్టీలను జాబితా తొలగించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఆరేళ్లుగా వరుసగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, ఇతర నిబంధనలను ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి కారణమని స్పష్టం చేసింది. దీంతో తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో 808 తొలగించిన పార్టీల సంఖ్యగా తేలింది. నవంబర్ నెలలో బీహార్, 2026 సంవత్సరంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయి. దీంతో ఈసీ నిబందనలు పాటించని పార్టీలను ఏరివేయడం ఆరంభించింది.
ఈసీ పర్యవేక్షణ ఎలా ఉంటుంది?
సోషల్ మీడియా, మీడియా రిపోర్టులు, ప్రజల ఫిర్యాదుల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది.
ఉల్లంఘన చేసిన పార్టీలపై ఎలాంటి శిక్షలు ఉంటాయి?
నోటీసులు, హెచ్చరికలు, అవసరమైతే ఎన్నికలలో అర్హత కోల్పోయే స్థాయిలో చర్యలు తీసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: