గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా (Kutch District) లో జూలై 31వ తేదీ గురువారం ఉదయం స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.3గా నమోదైనట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్చ్ (ISR) అధికారికంగా ప్రకటించింది. ఉదయం 9:52 గంటల సమయంలో భూమి కంపించినట్టు నివేదికలు వెల్లడించాయి.

బేలా ప్రాంతానికి సమీపంలో కేంద్రబిందువు
ఈ భూకంపం (Earthquake) కేంద్రం కచ్ జిల్లాలోని బేలా ప్రాంతానికి నైరుతి దిశగా సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉందని (ISR) పేర్కొంది. యథాతథంగా జరిగిన ఈ ప్రకంపనలు కొద్ది సెకన్ల పాటు మాత్రమే కొనసాగినట్టు స్థానికులు తెలిపారు.
ఎటువంటి ప్రాణ నష్టం లేదు
ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదని, గానీ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టం లేదా పెద్ద ఎత్తున భవన నష్టాల గురించి ఎలాంటి నివేదికలు వెలువడలేదని వారు తెలిపారు. కచ్ జిల్లా భూకంపాలకు “వెరీ హై సిస్మిక్ రిస్క్ జోన్”గా గుర్తించబడింది. ఇక్కడ తరచూ తక్కువ తీవ్రతతో భూమి కంపించే ఘటనలు చోటుచేసుకుంటుండడం నూతన విషయం కాదు. గతంలోనూ ఈ ప్రాంతం ఎన్నో భూకంపాలకు వేదికైంది.
2001 ఘోర భూకంపం జ్ఞాపకాలు
కచ్ భూభాగంలో 2001లో సంభవించిన ఘోర భూకంపం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆ విపత్తులో 13,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 1.67 లక్షల మందికి పైగా గాయపడ్డారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్పటి నుండి కచ్ జిల్లా భూకంపాల విషయంలో ప్రత్యేక దృష్టికి లోనైంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Blood Group: బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అరుదైన బ్లడ్ గ్రూప్