Latest News: e-KYC: PM ఉజ్వల యోజన కింద సబ్సిడీ రావాలంటే e-KYC తప్పనిసరి

Read Time:  1 min
e-KYC
e-KYC
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ వినియోగదారులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ వంటగ్యాస్‌ వినియోగదారు ప్రతి సంవత్సరం మార్చి 31లోపు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లేకపోతే ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద లభించే సబ్సిడీ నిలిపివేయబడుతుందని తెలిపింది.

Read Also: Gold rate 30/10/25 : మరోసారి పెరుగుతున్న బంగారం, వెండి ధరలు – నగరాల వారీగా వివరాలు

దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ (e-KYC) చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ గ్యాస్‌ ఏజెన్సీ (Gas Agency) వద్దకు వెళ్లి ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ బుక్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ చూపించి బయోమెట్రిక్‌ ధృవీకరణ చేయించుకోవచ్చు.

e-KYC
e-KYC

అదేవిధంగా ఆయిల్‌ కంపెనీల అధికారిక మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తిచేయవచ్చు. వినియోగదారు ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి, OTP లేదా ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా ధృవీకరించవచ్చు. ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే వినియోగదారుని ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.