📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi Airport : ఢిల్లీలో దుమ్ము తుపాను.. విమాన రాకపోకలకు అంతరాయం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 12, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Airport : దేశరాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణం కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు. పలువురు విమాన ప్రయాణికులు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తంచేశారు.

దాదాపు 15 విమానాలను దారి మళ్లింపు

ఢిల్లీలొని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీని కారణంగా కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈక్రమంలోనే బలమైన ఈదురుగాలులు వీయడంతో దాదాపు 15 విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు.

పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదన

ముంబయికి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు.అని ఒక ప్రయాణికుడు వార్తా సంస్థతో తెలిపారు. ఇక, పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదనను వ్యక్తంచేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో ఘటన

delhi Dust storm flight oper Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.