దేశంలో అండర్వరల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) సిండికేట్ (డీ-గ్యాంగ్) ఇప్పుడు తన డ్రగ్స్(Drugs) వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో తమ కార్యకలాపాలు దెబ్బతినడంతో, డీ-గ్యాంగ్ దక్షిణాది మార్కెట్పై దృష్టి సారించింది. ఇందుకోసం ఒకప్పటి శ్రీలంక మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) నెట్వర్క్ను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రెండు ప్రమాదకర శక్తులు చేతులు కలపడం దేశ భద్రతకు పెను సవాల్గా మారనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Crime: పట్టపగలే రోడ్డు పై స్నేహితుడిని హతమార్చిన తోటి స్నేహితులు
డ్రగ్స్ రవాణాకు ఎల్టీటీఈ నెట్వర్క్ వినియోగం
నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం, డీ-గ్యాంగ్(D-Gang) సభ్యులు శ్రీలంక, భారత్లోని మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు, సానుభూతిపరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి, వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు. శ్రీలంక(Sri Lanka) సైన్యం చేతిలో దెబ్బతిని, నిధుల కొరతతో బలహీనపడిన ఎల్టీటీఈకి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. డీ-గ్యాంగ్తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్లీ పుంజుకోవాలని, కొత్తగా సభ్యులను చేర్చుకుని, ఆయుధాలు సమకూర్చుకోవాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా తన దర్యాప్తులో గుర్తించింది.
రెండు వర్గాలకూ ప్రయోజనకరం, భద్రతా ముప్పు
ఈ కలయిక ఇరు వర్గాలకూ ప్రయోజనకరంగా ఉంది. డీ-గ్యాంగ్కు డబ్బు, వనరులు ఉన్నప్పటికీ, దక్షిణాదిలోని భూ, సముద్ర మార్గాలపై పట్టు లేదు. మరోవైపు ఎల్టీటీఈకి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. వారి నెట్వర్క్, అనుభవం డీ-గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి. గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందా మొత్తం ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేది. 1980ల నుంచే ఈ వ్యాపారంలో ఉన్న ఎల్టీటీఈ, శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది. ఈ కొత్త బంధం భద్రతా సంస్థలకు పెను తలనొప్పిగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: