Mamata Banerjee news : పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు స్వాగతం పలకాలి. అయితే తన పర్యటన సందర్భంగా అలాంటి అధికారిక స్వాగతం లభించలేదని ఆమె పేర్కొన్నారు.
స్వాగతం లేకపోవడంపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
బెంగాల్ పర్యటనకు వచ్చిన తనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా రాష్ట్ర మంత్రుల నుంచి అధికారిక స్వాగతం అందలేదని ముర్ము తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన తన పర్యటనలో ప్రోటోకాల్ లోపం కనిపించిందని ఆమె అన్నారు.
మమతపై ద్వేషం లేదన్న ముర్ము
ఈ సంఘటన జరిగినప్పటికీ మమతా బెనర్జీపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. మమత తనకు సోదరితో సమానమని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె కోపంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
Read Also: David Reddy Movie: ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా
సంతాల్ సదస్సు వేదిక మార్పుపై సందేహాలు
9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సు తొలుత బిధాన్ నగర్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తరువాత దాన్ని సిలిగురిలోని గోసాయిన్పూర్కు మార్చారని ముర్ము తెలిపారు. సదస్సుకు పెద్ద ఎత్తున ఆదివాసీలు వచ్చినప్పటికీ కొందరు వారిని అడ్డుకున్నారని ఆరోపించారు.
ఆదివాసీల ఐక్యతపై వ్యాఖ్యలు
సంతాల్ జాతీయులు ఏకమవడం, చదువుకోవడం, బలోపేతం కావడం కొందరికి ఇష్టం లేనట్లుగా ఉందని రాష్ట్రపతి అన్నారు. అయినప్పటికీ ఆదివాసీల అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: