📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బెంగళూరు లో మొదలైన త్రాగునీటి కొరత,కార్లు కడిగితే జరిమానా

Author Icon By Anusha
Updated: February 18, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవి తాపానికి నీటి కొరత భయంతో  బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. గతేడాది తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవంతో ఈసారి అధిక ఉష్ణోగ్రతలకు ముందు నుంచే పటిష్ఠ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యంగా త్రాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.బెంగళూరు నగరంలో తాగునీటి వినియోగంపై మున్సిపల్ బోర్డ్ పక్కా పర్యవేక్షణ అమలు చేయనుంది. త్రాగునీటిని వాహనాలు కడగడానికి, తోటల పెంపకానికి, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు ఉపయోగించినట్టు గుర్తిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఒకసారి జరిమానా చెల్లించిన తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేస్తే అదనంగా మరో రూ. 5,000 మరియు రోజుకు రూ. 500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది.ఈ చర్యలు వాటర్ బోర్డ్ యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులకు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్ల నిర్వాహకులకు నీటి వృథా చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా త్రాగునీటిని వృథా చేస్తుంటే తమ కాల్ సెంటర్ నెంబర్ 1916కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గతేడాది వేసవిలో బెంగళూరులో సుమారు 14,000 బోరుబావులు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) శాస్త్రవేత్తలు కూడా భవిష్యత్తులో బెంగళూరులో త్రాగునీటి కొరత మరింత తీవ్రంగా ఉండొచ్చని తెలిపారు.

అధికారులు త్రాగునీటి పొదుపు కోసం ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. అనవసరంగా నీరు వృథా కాకుండా చూడాలని, కార్లు, బైకులు కడగడంవంటివి చేయకూడదని తెలిపారు. ఇంటి పైకప్పుల నుంచి వర్షపు నీటిని సేకరించేందుకు రేన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.వాటర్ బోర్డ్ తీసుకున్న ఈ చర్యలు ప్రజలకు కొంత అసౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో నీటి కోసం ఎదుర్కోవాల్సిన కష్టాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి వేడిలో ఒక్కొక్క నీటి బొట్టు అమూల్యమని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.అందువల్ల, ఈ వేసవిలో నీటి పొదుపు అవసరాన్ని గమనించి, ప్రతి ఇంట్లో నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా అందరూ సహకరించాలని వాటర్ బోర్డ్ కోరుతోంది. అప్పుడే నగరంలో తాగునీటి కొరత సమస్యకు కొంతమేర ఉపశమనంగా మారనుంది.

త్రాగునీటివృథాపై సమాచారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి

త్రాగునీటిని వృథా చేస్తూ ఎవరైనా కనిపిస్తే, కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించింది. నీటి వృథాపై కఠిన చర్యలు తీసుకుంటామని ,బెంగళూరు వాటర్ బోర్డ్ ప్రజలను కోరింది.

#BangaloreUpdates #BangaloreWaterBoard #FineForWastingWater #SaveWater #WaterConservation #WaterCrisis #WaterShortage Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.