📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఈసీ పై మళ్లీ అనుమానాలు

Author Icon By Ramya
Updated: February 8, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్‌ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.ముఖ్యమంత్రి ఆతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది.వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో.. అరవింద్ కేజ్రీవాల్– న్యూఢిల్లీ, అతిషి- కల్కాజీ, మనీష్ సిసోడియా- జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్- రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్- బాబర్‌పూర్, మనోజ్ త్యాగి- కరావల్ నగర్, అనిల్ ఝా- కిరారీ, దినేష్ మొహానియా – సంగం విహార్, వినయ్ మిశ్రా- ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థలు ఉన్నారు. ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు.

ముఖ్యమంత్రి ఆతిషి :

మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది. వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో అరవింద్ కేజ్రీవాల్ – న్యూఢిల్లీ, అతిషి – కల్కాజీ, మనీష్ సిసోడియా – జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్ – రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్ – బాబర్‌పూర్, మనోజ్ త్యాగి – కరావల్ నగర్, అనిల్ ఝా – కిరారీ, దినేష్ మొహానియా – సంగం విహార్, వినయ్ మిశ్రా – ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థులు ఉన్నారు.

ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు. ఆయన అభిప్రాయాన్ని బలపరుస్తూ, ఈ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీజేపీ విజయానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా హిందూత్వ ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ ప్రభావం, ఢిల్లీ ప్రజల వైఖరి వంటి అంశాలు బీజేపీకి అనుకూలించాయని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, ఆమ్ ఆద్మీ పార్టీపై జరుగుతున్న దర్యాప్తులు, అరెస్టులు, విపక్షాల మధ్య ఐక్యత లోపం వంటి అంశాలు కూడా ఆప్ పరాజయానికి దోహదపడ్డాయని అభిప్రాయపడుతున్నారు.

ఒక్కప్పుడు ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆప్, ఈ ఎన్నికల్లో వెనుకబడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీకి గణనీయమైన ఓట్లు రావడం లేదని ఫలితాలు చెబుతున్నాయి. ఇది కాంగ్రెస్ నాశనం వైపు మరో అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

AAP BJP Breaking News in Telugu delhi elections results counting Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.