హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో ఒక అమాయకపు ఆట పెద్ద ప్రమాదానికి(danger) దారితీసింది. 12 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ రూ.10 నాణెం పొరపాటున మింగేశాడు. అది అతని అన్నవాహిక (ఆహార నాళం)లో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు కలిగించింది. ఊపిరాడక ఆరాటపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Read Also: Hyderabad Crime : నీటి ట్యాంక్లో 7 ఏళ్ల బాలిక మృతదేహం
15 నిమిషాల్లోనే ప్రమాదకర నాణెం తొలగింపు
ఫరీదాబాద్లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్దేశ్ చౌహాన్ నేతృత్వంలోని వైద్య బృందం ఎక్స్-రే చేసి నాణెం అన్నవాహికలో ఇరుక్కుపోయినట్లు గుర్తించింది. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశముందని భావించిన వైద్యులు వెంటనే అత్యవసర ఎండోస్కోపీ చేశారు. కేవలం 15 నిమిషాల్లోనే నాణెం బయటకు తీయగలిగారు. అదే రోజు సాయంత్రం బాలుడిని డిశ్చార్జ్ చేసి కుటుంబానికి అప్పగించారు.
తల్లిదండ్రులకు వైద్యుల సూచనలు
డాక్టర్ చౌహాన్ మాట్లాడుతూ – చిన్నపిల్లలు తరచూ పొరబాటున నాణెలు,(Coins), చిన్న వస్తువులు మింగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఇంటి చిట్కాలు ప్రయత్నించకూడదని హెచ్చరించారు. బలవంతంగా వాంతులు చేయించడం లేదా ఆహారం ఇవ్వడం మరింత ప్రమాదకరమని సూచించారు. ఇలాంటి సంఘటనలప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం ఒక్కటే సురక్షిత మార్గమని అన్నారు.
బాలుడు ఎక్కడ ఈ ఘటనకు గురయ్యాడు?
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో.
నాణెం ఎక్కడ ఇరుక్కుపోయింది?
బాలుడి అన్నవాహిక (ఆహార నాళం)లో.
Read hindi news: hindi.vaartha.com
Read Also: