ఉద్యోగుల కోసం అత్యంత ప్రీమియమ్ బహుమతులు: 51 SUVలతో దీపావళి సంబరం
చండీగఢ్లోని ప్రముఖ ఫార్మా కంపెనీ MITS గ్రూప్ ఈ దీపావళి(Diwali Bonus) తన ఉద్యోగులకు మరిచిపోలేని అనుభవాన్ని అందించింది. సాధారణంగా కంపెనీలు దీపావళి సందర్భంగా స్వీట్లు, బోనస్లు, గిఫ్ట్ వౌచర్లను ఇస్తుంటే, MITS గ్రూప్ మాత్రం ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు మొత్తం 51 లగ్జరీ SUVలు బహుమతిగా ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో స్వయంగా కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ MK భాటియా పాల్గొని, ఉద్యోగులకు కొత్త మోడల్ మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio SUV)ల కీలను చేతుల మీదుగా అందించారు. ఈ ఉదాత్త చర్యపై సోషల్ మీడియా వినూత్నంగా స్పందించింది. భాటియా మాట్లాడుతూ, ఇవాళ మా ఉద్యోగులు సాధించిన విజయాల వెనుక ఉన్న వాస్తవ కారణం వాళ్ల కృషి, అంకితభావం. అందుకే వారిని రివార్డ్ చేయాలనుకున్నాను. వాళ్లు నా వ్యాపారానికి వెన్నెముక అన్నారు.
Read also: సన్యాసం తీసుకుంటా..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

దివాలా నుండి దాతృత్వ దిశగా: భాటియా ప్రయాణం ఒక ప్రేరణ
భాటియా (Diwali Bonus) ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కథనమూ అంతే ప్రేరణాత్మకం. 2002లో తన మెడికల్ స్టోర్ భారీ నష్టాల వలన మూతపడింది. ఆ సమయంలో దివాలా తీసిన ఆయన, 2015లో MITS గ్రూప్ను స్థాపించి, తిరిగి తన జీవితం, వ్యాపారాన్ని గట్టిగా నిర్మించుకున్నారు. ప్రస్తుతం MITS గ్రూప్ కింద 12 సంస్థలు నడుస్తున్నాయి. భారతదేశంతో పాటు కెనడా, లండన్, దుబాయ్ వంటి దేశాల్లో లైసెన్సులతో వ్యాపారాన్ని విస్తరించారు. 2023లో సంస్థ విస్తరణ దిశగా, శిల్పా చందేల్ను CEOగా నియమించి, ఐదుగురు కొత్త డైరెక్టర్లను నియమించడం ద్వారా సంస్థకు పునర్జీవం పోశారు. గత మూడేళ్లుగా ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇవ్వడం వారి సంస్థలో ఒక సంప్రదాయంగా మారింది. దీన్ని భాటియా సెలబ్రేట్ చేసే సాంస్కృతిక విధానంగా వర్ణించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :