నిస్సహాయురాలికి మానవత్వంతో సాయం చేయాల్సింది పోయి, మానవత్వానికే మచ్చకలిగేలా దుండగులు ప్రవర్తిస్తే వారిని ఏం చేసినా పాపం పోదు. 22 ఏళ్ల ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
1) ఈ దశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లో నేరాలు ఘోరాలు అధికం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బలరాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
22ఏళ్ల దివ్యాంగురాలు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు
ఆమెను వెంబడించారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డుపై పారిపోయింది. దుండగులు పారిపోతున్నా ఆమెను వదలకాకుండా బైక్లపై వెంటాడారు. అనంతరం ఆమెను ఎత్తుకెళ్లి, నిర్జన ప్రదేశంలో ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలాల్లో పడిపోయిన యువతి
పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో యువతి పడి ఉండడం గమనించి, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నివాసాలకు కొంతదూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన జరిగిన 24గంటల్లో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నిందితులు నేపాల్కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అంకుర్ వర్మ (21), హర్షిత్ పాండే(22)గా గుర్తించారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారని సూపరింటెండెంట్ వికాస్ కుమార్ పేర్కొన్నారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఆపరేషన్ త్రినేత్ర(Operation Trinetra) ప్రత్యేక కార్యక్రమంకాగా ఇటీవల ఉత్తరప్రదేశ్లో నేరాలు పెరుగుతున్నందున వీటిని అరికట్టడానికి, నేరస్తులను గుర్తించడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ‘ఆపరేషన్ (operation) త్రినేత్ర’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ కెమరాలను అమర్చారు. ఈ కెమెరాల సహాయంతో నేరాలకు పాల్పడేవారి కదలికలను నిశితంగా పర్య వేక్షించి త్వరగా నిందితులను పట్టుకోవడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.