📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Dipender Hooda: మహాత్ముడి పేరు తొలగించడం మాత్రమే కాదు..

Author Icon By Tejaswini Y
Updated: December 22, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Employment Guarantee Scheme: మహాత్మాగాంధీ పేరు తొలగించడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది పేదల పొట్ట కొట్టాలనే కుట్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తోందని రోహతక్ ఎంపి దీపేందర్ హుడా(Dipender Hooda) ఆరోపించారు. గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ప్రచార కమిటీ చైర్మన్, మెట్టు సాయి కుమార్ చైర్మన్, ఫిషర్మెన్ కమిటీ, సామరాంమోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్, అల్లం భాస్కర్, సంధ్యా రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి, లింగం యాదవ్ తదితరులతో దీపెందర్ హుడా విలేఖరులతో కలిసి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేరు కోసం రాజకీయం చేస్తుందని అన్నారు.

Read also: Bihar: బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ

Dipender Hooda: It’s not just about removing the name of the Mahatma..

కోవిడ్ సమయంలో ఉపాధి హామీ సంజీవిని

కోవిడ్ సమయంలో పనికి ఆహార పథకం సంజీవిని లాగ పని చేసిందని వ్యాఖానించారు. జీ రామ్ జీ కి గ్యారెంటీ లేదని ఆయన ఆవేదన చెందారు. యూపిఎ ప్రభుత్వం రోజ్ గార్ యోజనను పూర్తిగా కేంద్రం నిధులు కేటాయించింది. బిజెపి ప్రభుత్వం జి రామ్ జి పేరుతో రాష్ట్రలపై భారం మోపాలని చూస్తుందని ఆరోపించారు. గతంలో రాష్ట్రాలు పని దినాలు చూపించింది కానీ ఇప్పుడు కేంద్రమే పని దినాలు నిర్ధారిస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు పనుల ఎంపిక హక్కులు ఉండవు కేంద్రం ఆధీనంలో ఉంటదనీ తెలిపారు.

కేంద్రంపై కాంగ్రెస్ ఆరోపణ

90-10శాతం నిధులు కేంద్రం ఇచ్చేదని ఇప్పుడు 60-40 మించి నిధులు ఇవ్వదని తెలిపారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు కానీ అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది క్రమేణామన్రేగా పథకాన్ని తీసివేయలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఒప్పుకొము అని తెలిపారు. వందే మాతరం గీతాన్ని మార్చి కొత్త గీతాన్ని తీసుకరావాలని బిజెపి చూస్తుందని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కానీ కోర్టు వాస్తవాలను గుర్తించిందని అన్నారు. 2015 లో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ప్రయివేట్ ఫిర్యాదుతో ఇడి. సిబిఐ కేసు నమోదు చేసింది. మని లాండరింగ్ జరిగిందని పదే పదే రెండు సంస్థలు కేసులో పెట్టి ఇబ్బంది పెట్టిందని ఆవేదన చెందారు. కేవలం రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం చేశా రనీ చివరకు ఇడిసిబిఐ కేసును తిరస్కరించింది చివరకు సత్యమే గెలిచిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP congress party Dipender Hooda Employment Guarantee Scheme MGNREGA Modi government Poverty Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.