దేశంలో డిజిటల్ సేవలు (Digital services) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరి జీవితానికి ఈ సదుపాయాలు చేరడం ఇంకా పెద్ద సవాల్గా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ,దూరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించడం లేదు. ఇటీవల అందిన గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఉంది. అంటే సుమారు 13.7 శాతం కుటుంబాలకు ఆన్లైన్ సదుపాయం లేదు.
Read Also: AP: కొత్త రైల్వే లైన్ కి రూ. 713.33 కోట్లు మంజూరు

ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువ
అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తోంది..దీని వల్ల ఆ ప్రాంతాల ప్రజలకు ఆన్లైన్ విద్య, డిజిటల్ ఆరోగ్య, ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువగా ఉంది.
దేశం AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ వంటి ఆధునిక సాంకేతికతల వైపు అడుగులు వేస్తోంది. 5G కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ వేగం, డేటా ప్రసార సామర్థ్యం పెరుగుతుంది. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయవచ్చు. అయితే, ఈ సాంకేతికతల ప్రయోజనాలు అందరికీ అందడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: