📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత ..50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం

Author Icon By sumalatha chinthakayala
Updated: November 20, 2024 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 450 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి మరింత ఎక్కువగానే ఉంది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (490) స్థాయితో పోలిస్తే మంగళవారం 460తో స్వల్పంగా మెరుగుదల నమోదైంది. ఈరోజు మరో పదిపాయింట్లు మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రమాదకర విభాగంలోనే ఉంది. తీవ్ర వాయుకాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

‘కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటి నుంచి పనిచేయాలని నిర్ణయించింది. 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు. దీని అమలు కోసం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’ అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఇందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంక్షోభంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది.

ఢిల్లీ ప్రభుత్వం గతంలో తన కార్యాలయాలు మరియు MCD కోసం అస్థిరమైన కార్యాలయ సమయాలను ప్రకటించింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయాల సమయాలను ఉదయం 8.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయం ఉదయం 10 నుండి సాయంత్రం 6.30 వరకు నిర్ణయించబడింది.

air pollution Delhi Government Employees severe pollution work from home

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.