Delhi AQI today : దేశ రాజధాని ఢిల్లీ లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన కాలుష్యం కలిసివచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ‘వెరీ పూర్’ స్థాయిలో ఉన్న గాలి నాణ్యత (AQI), రోజు ముగిసే సరికి మరింత దిగజారి ‘సివియర్’ స్థాయికి చేరింది. సోమవారం ఉదయం అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నాకు చేరడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) గణాంకాల ప్రకారం, ఆనంద్ విహార్ (458), అశోక్ విహార్ (430), జహంగీర్పురి (439), చంద్రి చౌక్ (426), ముండ్కా (416), నరేల (404), ఒక్లా ఫేజ్-2 (411) వంటి ప్రాంతాల్లో AQI 400కు పైగా నమోదైంది. దీంతో పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ఆరెంజ్ (Delhi AQI today) అలర్ట్ జారీ చేసింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 7 డిగ్రీల సెల్సియస్ వరకు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో డిసెంబర్ 31 వరకు దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
కాలుష్య పరిస్థితి మరింత దిగజారితే, గాలినాణ్యత నిర్వహణ కమిషన్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) సబ్-కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం GRAP స్టేజ్-3 నిబంధనలు అమలులో ఉన్నాయి. AQI 450 దాటితే స్టేజ్-4 కఠిన ఆంక్షలు తిరిగి అమలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, వాహనాల సంఖ్య తగ్గించకుండా కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. షేర్డ్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూనే రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: