Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానం (Excise Policy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మల్సీ కవిత కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా దర్యాప్తులో లోపాలున్నాయంటూ CBIని కోర్టు తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో దర్యాప్తు సంస్థ CBI అనుసరించిన విధానాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఈ కేసులో ఉన్న నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తిర్పు వెలువరించారు.
Read Also: YouTuber Anvesh: లుకౌట్ నోటీసులపై స్పందించిన అన్వేష్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: