📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఢిల్లీ ఎన్నికలు – జోరుగా బెట్టింగ్ లు

Author Icon By Vanipushpa
Updated: January 24, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా కాలం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా జరుగుతున్నాయి. వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి విపక్ష బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ప్రస్తుతం హస్తినలో ఒక్కో సీటులో గెలుపు ఇరు పార్టీలకు కీలకంగా మారిపోయింది. ఎన్ని హామీలు ఇస్తున్నా, పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం ఆప్, బీజేపీలకు గుబులు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అంచనాలు కీలకంగా మారిపోయాయి. వచ్చే నెల 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందన్న విషయాన్ని దాదాపు అన్ని సర్వే సంస్థలు, ఒపీనియన్ పోల్స్ నిర్ధారిస్తున్నాయి. అయితే విజేత ఎవరనే విషయంలో మాత్రం మెజార్టీ సర్వే సంస్థలు దాదాపు ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన పలు సర్వే సంస్థలు, అధ్యయన సంస్థల అంచనాలు చూస్తే ఇదే అర్థమవుతోంది. అలాగే బెట్టింగ్ బజార్లు కూడా ఇప్పుడు విజేతపై క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

ఇప్పటి వరకు వెలువడిన పలు ఒపీనియన్ పోల్స్ అధికార ఆప్ కు ఆధిక్యం కట్టబెట్టాయి. తాజాగా రాజస్థాన్‌లోని ఫలోడి సత్తా బజార్ బెట్టింగ్ మార్కెట్ కూడా ఆప్ 36 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. 70 సీట్ల అసెంబ్లీలో ఆప్ కు 39-41 సీట్లు వస్తాయని, అలాగే విపక్ష బీజేపీకి మాత్రం 29 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. గతంలో ఆప్ కు 36 సీట్లు వస్తాయని అంచనా వేసిన సత్తా బజార్.. తాజాగా అంచనా సవరించింది. అదే సమయంలో ప్రముఖ సర్వేల సంస్థ సీ-ఓటర్ కూడా తమ అంచనాల్ని విడుదల చేసింది. ఇందులోనూ ఆప్ హవా కొనసాగబోతోందని తేలిపోయింది. తమ సర్వేలో 51 శాతం మంది ఆప్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు సీ-ఓటర్ తెలిపింది.

app BJP congress Delhi Elections 2025 heavy betting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.