ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యాల్లో బీజేపీ జోరు..

Read Time:  1 min
Delhi election results.. BJP strength in the lead
Delhi election results.. BJP strength in the lead
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.

image

తాజా ఫలితాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో బీజేపీ 70 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉండగా, ఓఖ్లాలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ఆధిక్యంలో ఉన్నాడు.

కార్యాన్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా లీడింగ్‌లో ఉండగా, బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నాడు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ఆధిక్యంలో ఉండగా బిజ్వాసన్ నియోజకవర్గంలో బీజేపీ తఅభ్యర్థి కైలాష్ ముందంజ ఉండడం గమనార్హం.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.