Delhi Crime: సైబర్ సిటీ గురుగ్రామ్లో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతానికి చెందిన రాహుల్ విజయరాన్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమార్తెను తీసుకుని ఒక హైరైజ్ అపార్ట్మెంట్ 23వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. భారీ శబ్దంతో కిందపడిన తండ్రి, కుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్ అదే సొసైటీలోని టవర్-9లో నివసిస్తున్నాడు. కానీ, అతడు ఆత్మహత్య కోసం మాత్రం టవర్-9 కాకుండా పక్కనే ఉన్న మరో టవర్ను ఎంచుకున్నాడు. తన నివాసం ఉన్న టవర్ నుంచి కాకుండా వేరే భవనం పైకి వెళ్లి దూకడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: Kabul Air Strikes: కాబూల్లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

రాహుల్ భార్య, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాహుల్ ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నాడా? లేక కుటుంబంలో ఏవైనా గొడవలు జరిగాయా? అనే విషయాన్ని విచారిస్తున్నారు. అమాయకపు రెండేళ్ల చిన్నారిని కూడా మృత్యువులోకి లాగడం చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. అతడు ఆ టవర్లోకి ఎలా వెళ్లాడు? ఎవరైనా అతడిని వెంబడించారా? లేక కావాలనే అక్కడికి వెళ్లాడా? అనేవి తేలాల్సి ఉంది. పోస్ట్మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని పోలీసు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: