News Telugu: Delhi blast: ఢిల్లీ విధ్వంసానికి టెర్రరిస్టుల కుట్ర

Read Time:  1 min
Delhi blast: Terrorist conspiracy to destroy Delhi
Delhi blast: Terrorist conspiracy to destroy Delhi
FONT SIZE
GET APP

దిల్లీ బ్లాస్ట్ ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (NIA) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాంబు దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఉమర్ నబీకి జసిర్ బిలాల్ వానిని కీలక అనుచరుడుగా అరెస్ట్ చేశారు. ఆధికారుల వివరాల ప్రకారం, నవంబర్ 10 దిల్లీ బ్లాస్ట్‌కు ముందే హమాస్ విధంగా డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కశ్మీర్‌కు చెందిన జసిర్ బిలాల్ వానిని విచారించినప్పుడు డ్రోన్ల, సాంకేతిక సహకారం విషయంలో ఉమర్ నబీకి సహాయం చేశాడని వెల్లడైంది. జసిర్ డానిష్ అలియాస్‌గా, అత్యంత శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయగల నైపుణ్యత కలిగినట్లు అధికారులు గుర్తించారు. పెద్ద బ్యాటరీలు ఉపయోగించి డ్రోన్ల ద్వారా ఎక్కువ విధ్వంసం జరగేలా ప్లాన్ చేసినట్లు, అలాగే కారు బాంబు తయారీలో కూడా జసిర్ సహకరించినట్లు NIA తెలిపింది.

Read also:  WhatsApp: న‌టి పేరుతో నకిలీ వాట్సప్‌..అప్రమత్తంగా ఉండాలన్న శ్రియ

Delhi blast: Terrorist conspiracy to destroy Delhi

Delhi blast: Terrorist conspiracy to destroy Delhi

పేలుడులో 15 మంది మృతిచెందారు

ఇకగా, ఇప్పటికే అరెస్టైన అమీర్ రషీద్ అలీని 10 రోజుల NIA కస్టడీకి అప్పగించారు. పేలుడు ఘటనలో ఉపయోగించిన ఐ-20 కారు అతని పేరుపై నమోదైనట్లు తేలింది. అమీర్ రషీద్ జమ్మూ-కాశ్మీర్ పాంపోర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 15 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 13 మంది ఘటనా సమయంలో చనిపోయి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతానికి NIA, దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌లు కలసి విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.