📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్టు చేసిన ఎన్ ఐఎ

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ కారు పేలుడు (Delhi Blast) ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ ఐఎ తనిఖీలను ముమ్మరం చేసింది. భారీగా ప్రానష్టానికి కుట్రపడ్డ టెర్రరిస్టుల (Terrorists) పన్నాగాన్ని భారత నిఘాసంస్థ బట్టబయలు చేసింది. దీంతో పలువురిని ఎన్ ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. అదేసమయంలో జమ్మూ కాశ్మీర్ లోని కశ్మీర్ టైమ్స్ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. 

Read Also: Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు

Delhi Blast NIA arrests four more people in Delhi blast case

ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ 

ఈనెల 10న జరిగిన ఢిల్లీ కారు పేలుడు ఘటనతో ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఉగ్రలింకుల ఆధారంగా ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. వీళ్లందర్నీ శ్రీనగర్, జమ్ములో అదుపులోకి తీసుకోగా.. అక్కడి నుంచి తీసుకొచ్చి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు.

కస్టడీకి అప్పగించడంతో ఎన్ ఐఎ ప్రధాన కార్యాలయానికి తరలించారు. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్నీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో ఏకే-47 బుల్లెట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, మూడు గ్రనేడ్ లెవర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధ భాసిన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్న అనురాధ భాసిన్

భారతదేశం, జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమూచారాన్ని ఆమె వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతోనే సోదాలు చేసినట్లు చెప్పారు. ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమన్నారు. ఇక కశ్మీర్ టైమ్స్ జమ్మూకశీర్ కు చెందిన ప్రముఖ దినపత్రిక కాగా.. ఆ సంస్థలో సోదాలపై కశ్మీర్ టైమ్స్ సీనియర్ ఎడిటర్లు ఫైర్ అవుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

arrest of suspects counter-terrorism. delhi blast Google News in Telugu Latest News in Telugu NIA Investigation Red Fort Attack Telugu News Today terror module

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.