Telugu News: Delhi Blast: ఆవును దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక చేశాం: ముజమ్మిల్

Read Time:  1 min
Delhi Blast
Delhi Blast
FONT SIZE
GET APP

తీగలాగితే డొండ కదిలినట్లుగా ఓ బాంబుపేలుడు (Delhi Blast) ఘటన పెద్ద కుట్ర నుంచి దేశాన్ని కాపాడింది. లేకపోతే దేశ వ్యాప్తంగా వేలాదిమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఉగ్రవాదులు ఎంతగా తెగిస్తున్నారు అంటే తమ వైద్యవృత్తినే పణంగా పెట్టేలా వైద్యులను తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో భాగమే జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అల్-ఫలాహ్ వర్సిటీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. ఇక కుట్ర వెనుక ఎవరున్నది అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక టెర్రర్ మాడ్యూల్ ప్రకారం అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్ర డాక్టర్ల బృందం కుట్ర పన్నినట్లుగా తేలింది. 

Read Also: CRDA meeting: భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చెయ్యం: నారాయణ 

Delhi Blast
Delhi Blast Cow was planned for nationwide blasts: Muzammil

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

జైషే ఉగ్రసంస్థ ఆదేశాలతో దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న అధికారులు ఇప్పటికే డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్ తోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి పలువురు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముజమ్మిల్ ఇంట్లో పెద్ద ఎత్తున 2,900కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. 

అలాగే దేశవ్యాప్తంగా పేలుళ్లు ఎలా జరపాలన్న దానిపై షాహీనా ప్రణాళికలు రచించినట్లుగా అధికారులు కనిపెట్టారు. ముజమ్మిల్ ను విచారించగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నినట్లుగా ముజమ్మిల్ నేరాన్ని అంగీకరించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. 2023లోనే ఈ ప్రణాళిక వేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు వర్గాలకు ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

పేలుళ్ల ప్రణాళిక ఎవరిపై జరిగింది?

దేశవ్యాప్తంగా పేలుళ్లు నిర్వహించడానికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

పేలుళ్ల ప్రణాళిక చేసిన వ్యక్తి ఎవరు?

ముజమ్మిల్ అనే ఉగ్రవాది ఈ ప్రణాళిక చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.