📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Delhi Blast: బిర్యానీ కోడ్ ఉపయోగించి బాంబుల తయారీ

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ(Delhi Blast)లో ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసులో కొత్తగా బయటపడుతున్న వివరాలు విచారణాధికారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉగ్రకుట్రలో పాల్గొన్న డాక్టర్ల గుంపుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ హ్యాండ్లర్ ‘హంజుల్లా’ ఆన్‌లైన్ ద్వారా బాంబుల తయారీపై మార్గదర్శకత్వం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు ఈ హంజుల్లా పేలుడు పదార్థాల తయారీ వీడియోలు కూడా పంపినట్లు విచారణలో తేలింది. ‘హంజుల్లా’ అనే పేరు నిజానికి ఒక మారుపేరు మాత్రమే అని భావిస్తున్నారు.

Read Also: OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజ‌న్ 3, ‘బైసన్’

బాంబులను ‘బిర్యానీ’, దాడులను ‘దావత్’ పేర్లతో

జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్‌ ద్వారా షకీల్ మొదటిసారి ఈ నెట్‌వర్క్‌తో కలిసినట్లు అధికారులు వెల్లడించారు. షకీల్‌ను రాడికలైజ్ చేసిన అనంతరం, ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ(Al-Fala University)లో పనిచేస్తున్న ఇతర వైద్యులను కూడా కుట్రలోకి తీసుకొచ్చేందుకు మౌల్వీ సహకరించాడు. పేలుడు పదార్థాల రవాణా నుంచి ఆత్మాహుతి దాడిలో వినియోగించిన హ్యుందాయ్ ఐ20 వాహనం ఉగ్రవాది ఉమర్ మహ్మద్‌కు చేరే వరకు షకీల్ ముఖ్య పాత్ర పోషించినట్లు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తులను తప్పుదారి పట్టించేందుకు ఈ ముఠా టెలిగ్రామ్‌లో ప్రత్యేక కోడ్ పదాలను ఉపయోగించినట్లు వెల్లడైంది. బాంబులను ‘బిర్యానీ’, దాడులను ‘దావత్’ పేర్లతో గుర్తిస్తూ తమ అంతర్గత కమ్యూనికేషన్ కొనసాగించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని కీలక స్థలాలను లక్ష్యంగా చేసుకొని 200 శక్తివంతమైన పేలుడు పరికరాలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ కుట్రకు కేంద్ర బిందువుగా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈడీ అధికారులు టెర్రర్ ఫండింగ్, మనీలాండరింగ్ ఆరోపణల పై యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. యూనివర్సిటీకి చెందిన 25 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.48 లక్షలు, కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ కార్యకలాపాలను మరింత లోతుగా పరిశీలించేందుకు ఫరీదాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Al Falah University Delhi blast case Faridabad SIT Jaish-e-Mohammed module Red Fort Blast Terror Funding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.