Telugu News: Delhi Blast: ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్.. బాలానగర్లో హై అలెర్ట్

Read Time:  1 min
Delhi Blast
Delhi Blast
FONT SIZE
GET APP

ఢిల్లీ(Delhi Blast) ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను కదిలించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించగా, హైదరాబాద్‌లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

Read Also: Delhi Blast: చదువులో టాపర్ నుంచి ఉగ్రవాదిగా మారిన లేడీ డాక్టర్ కథ ఏంటి?

సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తు భాగంగా ఐడీపీఎల్ డీమార్ట్, విమల థియేటర్, రాజుకాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి వాహనం, బ్యాగ్, అనుమానాస్పద వస్తువును జాగ్రత్తగా పరిశీలించారు.

ఈ తనిఖీలతో పాటు స్థానిక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా చర్యలు కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, పరిస్థితి పూర్తిగా సాధారణం అయ్యే వరకు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.