हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు పూర్తి

Sharanya
Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు పూర్తి

వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రభుత్వం చారిత్రాత్మకంగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) పద్ధతిని ప్రయోగించనుంది. ఇది దేశంలో తొలి సారిగా ఢిల్లీ నగరంలో చేపట్టబోయే సాంకేతిక ప్రయోగం కావడం విశేషం.

క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?

క్లౌడ్ సీడింగ్ (Cloud seeding) అనేది వాతావరణ శాస్త్రంలో వినియోగించే ఆధునిక సాంకేతికత. ఇందులో తేమతో నిండిన మేఘాలలో రసాయన పదార్థాలను చల్లడం ద్వారా వర్షాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్, లేదా ఇతర క్రిస్టల్స్ వాడుతారు. ఇవి మేఘాల్లోని నీటి ఆవిరిని సుదీర్ఘ నీటి బిందువులుగా మారుస్తాయి, తద్వారా వర్షం పడే అవకాశం పెరుగుతుంది.

ముఖ్యమంత్రి రేఖా గుప్తా నాయకత్వంలో పర్యావరణ శాఖ ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపడుతోందని సిర్సా అన్నారు. “ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దీనికోసం మేము అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. అందుకే కృత్రిమ వర్షం లాంటి సాహసోపేతమైన అడుగు వేస్తున్నాం. ఇది కచ్చితంగా మార్పు తెస్తుందని ఆశిస్తున్నాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగాలు

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించి, సాంకేతిక సమన్వయం కోసం పూణెలోని భారత వాతావరణ విభాగానికి (ఐఎండీ) సమర్పించిందని మంత్రి తెలిపారు. “జులై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే జులై 4 నుంచి 11 మధ్య ప్రయోగానికి ఒక విండోను ప్రతిపాదించాం” అని ఆయన వివరించారు. ఒకవేళ ఈ తేదీల్లో వాతావరణం అనుకూలించకపోతే ప్రయోగాన్ని తరువాత తేదీలో నిర్వహించేందుకు వీలుగా మరో ప్రత్యామ్నాయ విండోను కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ప్రతిపాదన పంపినట్టు సిర్సా పేర్కొన్నారు.

ప్రయోగానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

‘ఢిల్లీ ఎన్‌సీఆర్ కాలుష్య నివారణకు ప్రత్యామ్నాయంగా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ప్రదర్శన, మూల్యాంకనం’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా వాయవ్య, ఔటర్ ఢిల్లీలోని లో-సెక్యూరిటీ ఎయిర్ జోన్లలో ఐదు విమానాలతో ప్రయోగాలు నిర్వహిస్తారు. సెస్నా విమానాలకు మార్పులు చేసి, వాటి ద్వారా మేఘాలపై రసాయన మిశ్రమాన్ని చల్లుతారు. ప్రతి విమానం సుమారు 90 నిమిషాల పాటు గాలిలో ఉండి, 100 చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన ఈ మిశ్రమంలో సిల్వర్ అయోడైడ్ నానోపార్టికల్స్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటాయి. ఈ మిశ్రమాన్ని తేమతో నిండిన మేఘాలపై చల్లడం ద్వారా నీటి బిందువులు త్వరగా ఏర్పడి, కృత్రిమ వర్షం కురుస్తుంది.

రాజకీయ విమర్శలు, ప్రభుత్వం స్పందన:

కృత్రిమ వర్షం ప్రతిపాదనను బీజేపీ ఎగతాళి చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రయోగం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ చేసిన విమర్శలపై మంత్రి సిర్సా ఘాటుగా స్పందించారు. “కృత్రిమ వర్షం కోసం మొదట ఒప్పందంపై సంతకాలు చేసింది మేమే. ఐఐటీ కాన్పూర్‌కు అవసరమైన నిధులు చెల్లించి, అనుమతుల కోసం దరఖాస్తు చేసింది కూడా మేమే. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ ప్రయోగానికి తేదీ ఖరారు చేసే స్థాయికి వచ్చామని సిర్సా తెలిపారు.

Read also: Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై లైంగికదాడి: పోలీసులకు కీలక సీసీటీవీ ఆధారాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870