📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Delhi: గుంతలో పడి యువకుడి మృతి

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ ఢిల్లీలోని (Delhi)) ఓ సాధారణ మధ్యతరగతి ఇంట్లో ఆ రాత్రి ఆనందానికి బదులు విషాదం అలుముకుంది. ఇంటికి చేరాల్సిన యువకుడు దురదృష్టవశాత్తూ తిరిగి రాలేదు. కొన్ని నిమిషాల్లో కలవాల్సిన కుటుంబం, ఇక ఎప్పటికీ ఆ ఎదురుచూపుతోనే మిగిలిపోయింది.

కాల్ సెంటర్ ఉద్యోగి (Call center employee) అయిన కమల్ సరిగ్గా అర్థరాత్రి 12:50 గంటలకు తన కవల సోదరుడికి ఫోన్ చేసి తల్లికి ఇమ్మన్నాడు. అమ్మా చపాతీలు సిద్ధం చేయి, మరో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పాడు. కానీ ఆ 15 నిమిషాలు కాస్తా నిరంతర నిరీక్షణగా మిగిలిపోయింది. ఆ యువకుడు మరెప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

Read Also: Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్

తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళా కుటుంబానికి శోకం.

కమల్ పని ముగించుకుని తన బైక్‌పై వస్తుండగా జనక్‌పురి వద్ద ఢిల్లీ (Delhi) జలమండలి తవ్విన 15 అడుగుల లోతైన గుంతలో పడి మరణించాడు. సీవరేజీ పనుల కోసం తీసిన ఈ గొయ్యి వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడం, వీధి దీపాలు లేక ఆ ప్రాంతం అంతా చీకటిమయంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తన సొంత సంపాదనతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకే అతడికి చిట్టచివరి ప్రయాణ సాధనమైంది.

అర్థరాత్రి దాటినా కొడుకు రాకపోవడంతో ఆ తండ్రి, సోదరుడు గాలింపు మొదలుపెట్టారు. ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ల వరకు తెల్లవార్లూ తిరిగారు. ఉదయం వెలుగు చూశాక గొయ్యిలో పడి ఉన్న కమల్ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. “మా నాన్న రాత్రంతా వెతికారు ఉదయం తన కొడుకు శవాన్ని చూశారు” అంటూ కమల్ సోదరుడు కరణ్ కన్నీరుమున్నీరయ్యాడు.

తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళా ఇలా జరగడం ఆ కుటుంబానికి తీరని శోకం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. కనీసం బారికేడ్లు, సేఫ్టీ నెట్లు కూడా లేకుండా రహదారిని తవ్వడమే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక ఇంటి సంతోషాన్ని చిదిమేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

call center employee Kamal last phone call Latest News in Telugu middle-class family Telugu News Tragic Incident West Delhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.