हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

Divya Vani M
Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో (NTR district in Mylavaram) ఓ కుటుంబంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మైలవరం గ్రామంలో ఓ ఇంట్లో నాలుగు రోజులుగా తాళం వేసి ఉంది. గురువారం ఉదయం లోపల నుంచి గాఢమైన దుర్వాసన రావడం గమనించిన ఓ వ్యక్తి, వెంటనే తన ఇంటి తలుపులు పగలగొట్టాడు. అక్కడ జరిగిన దృశ్యం గ్రామాన్ని కదిలించింది.ఇంట్లో మంచంపై ఇద్దరు చిన్నారులు (Two children) కదలకుండా పడి ఉన్నారు. వారు ఎలాంటి స్పందన లేకుండా ఉండటాన్ని గమనించి స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని వచ్చేసరికి, చిన్నారులు లక్ష్మీ హిరణ్య (9), లీలాసాయి (7) అప్పటికే మృతి చెందారు.

Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..
Mylavaram : మైలవరంలో తీవ్ర విషాదం : ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు..

భార్య వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా పిల్లల పెంపకం

వేములమడ రవిశంకర్, చంద్రిక దంపతులకు ఈ ఇద్దరు పిల్లలు. కానీ రెండు నెలల క్రితం చంద్రిక ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలు తండ్రితోనే ఉన్నారు. రవిశంకర్ తమ ఇంటి దగ్గర కనిపించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

పిల్లల హత్య తరువాత తండ్రి ఆత్మహత్య?

పోలీసులకు ఒక లేఖ లభించింది. అందులో రవిశంకర్ తన బాధను పంచుకున్నట్టు ఉంది. “నేను ఏమీ సాధించలేకపోయాను.. నా పిల్లలను చంపుకుని నేనూ చనిపోతున్నాను” అని ఆ లేఖలో వ్రాశాడు. ఫోన్ చివరిసారిగా కృష్ణా నది సమీపంలో కనిపించడంతో, అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

కృష్ణా నదిలో గాలింపు, గ్రామంలో తీవ్ర విషాదం

రవిశంకర్ ఆత్మహత్య చేశాడా అనే అనుమానంతో పోలీసులు నది వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మైలవరం గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తల్లి వదిలేయడం, తండ్రి హత్యకు పాల్పడటం స్థానికుల హృదయాలను పిండేస్తోంది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870