పాత రోజుల్లో ఒక కుటుంబంలో ఐదుగురు పిల్లలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెడుతున్నారు. జీవితపు ఉరుకులు, ఆర్థిక భారం కారణంగా ఇది నేటి నూతన నిబంధనగా మారింది.భారత్ జనాభా (India’s population) ప్రస్తుతం 146 కోట్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం, జననాల రేటు (Birth rate) ఇప్పుడు 1.9కి పడిపోయింది. భర్తీ రేటు అయిన 2.1 కన్నా ఇది తక్కువ. అంటే, జనాభా పెరుగుదల కంటే తక్కువగా జననాలు జరుగుతున్నాయి.దేశంలో ఇప్పటికీ యువ జనాభా భారీగా ఉంది. 0-14 ఏళ్ల వారు 24 శాతం, 10-24 ఏళ్ల యువత 26 శాతం ఉన్నారు. పని చేసే వయస్సు 15-64 మధ్య వయసు వారు మొత్తం జనాభాలో 68 శాతం. కానీ వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం 146 కోట్లగా ఉన్న జనాభా 40 ఏళ్లలో 170 కోట్లకు చేరనుంది. అక్కడినుంచి తిరోగమనం మొదలవుతుంది. 1960లో మహిళలు సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఇద్దరికి పరిమితం అయ్యింది.
జననాల వెనకడుగు.. అసలైన కారణాలు
ఐరాస 14 దేశాల్లో సర్వే నిర్వహించింది. భారత్ నుంచి 1,048 మంది అభిప్రాయాలు తెలిపారు. అందులో 38% మంది ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమన్నారు. ఉద్యోగ భద్రత లేదని 21%, ఇల్లు లేదని 22%, పిల్లల సంరక్షణలో ఇబ్బందులని 18% తెలిపారు. అలాగే ఆరోగ్యం, మాతృ సంరక్షణ, కుటుంబ ఒత్తిడులు కూడా ప్రధాన కారణాలు.
రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
బిహార్, యూపీ, జార్ఖండ్లో జననాల రేటు ఇంకా ఎక్కువగా ఉంది. కానీ కేరళ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో భర్తీ రేటు కన్నా తక్కువగా ఉంది. దీనికి కారణం ఆర్థిక వ్యత్యాసాలు అని ఐరాస అభిప్రాయం.
భారతదేశం ముందు ఉన్న అవకాశాలు
జననాల రేటు తగ్గడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. విద్యా సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ పెరగడం వల్ల మహిళలు తమ కుటుంబ పరిమితిపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు పునరుత్పత్తి హక్కులు, ఆర్థిక అభివృద్ధి కలిసి ముందుకు నడిపే అవకాశంగా మారుతోంది.
Read Also : Ranganath : జీహెచ్ఎంసీ మాన్సూన్ అత్యవసర బృందాలు హైడ్రాకు బదిలీ