డిసెంబర్ 31 వచ్చేస్తోంది. ఇంకో వారం రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఏడాది ముగిసేలోపు మన ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొన్నింటికి గడువు ముగుస్తోంది. ఈ లోపు మీరు ఆ పనులు చేయకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులను మీరు చేతులారా పొగోట్టుకున్నవారు అవుతారు. ఈ ఏడాది ముగియడానికి ఇంకా 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఉద్యోగులు లేదా వ్యాపారులు అయితే ఈ ఒక్క పని తప్పనిసరిగా చేయాల్సిందే. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన డబ్బులు ఎప్పటికీ రావు. అదేంటంటే.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR)
ఫైల్ చేయకపోతే వెంటనే ఆ పని చేయండి
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఆలస్య రుసుం చెల్లించి మీరు ఆ గుడువులోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తర్వాత మీరు ఫైల్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి వాపసు పొందలేరు. మీకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయకపోతే వెంటనే ఆ పని చేయండి. దీని వల్ల మీరు కట్టిన ట్యాక్స్ మనీ తిరిగి పొందుతారు. లేకపోతే మీకు నష్టమే. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 16 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు లేట్ ఛార్జీలు చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: