हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Amritsar Hooch Tragedy: 21కి చేరిన మృతుల సంఖ్య

Sudheer
Amritsar Hooch Tragedy: 21కి చేరిన మృతుల సంఖ్య

పంజాబ్‌లోని అమృత్‌సర్‌(Amritsar )లో చోటు చేసుకున్న కల్తీ మద్యం (consuming spurious liquor) ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాల్లోని ప్రజలు మద్యం సేవించిన కొద్ది సమయానికే అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి మొదలైన ఈ విషాద ఘటన మంగళవారం ఉదయానికి తీవ్ర రూపం దాల్చింది. మొదట 14 మంది మృతి చెందగా, తాజాగా మృతుల సంఖ్య 21కి (21 people died)చేరింది. ఇంకా కొంతమందిని ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేర్చారు.

మద్యం తాగిన వారిలో అనారోగ్య లక్షణాలు

పోలీసులు, స్థానిక అధికారులు ఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితులను అమృత్‌సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగిన వారిలో అనారోగ్య లక్షణాలు ఉన్నా లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా వారందరినీ పరీక్షలకు లోనుచేశారు. మద్యం తయారీలో మిథనాల్ అనే విషపూరిత రసాయనాన్ని అధికంగా కలపడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. మిథనాల్ తాగినప్పుడు శరీరానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటివరకు 9 మంది అరెస్ట్

ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ, ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. బాధ్యత లేకుండా ప్రవర్తించిన నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించారు. వారిలో డీఎస్పీ, ఎక్సైజ్‌ మరియు టాక్సేషన్‌ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు కల్తీ మద్యం సేవించవద్దని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.

Read Also : Bellankonda Srinivas : రాంగ్ రూట్‌లో కారు నడిపిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870