Cyber Fraud: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ కళ్యాణ్ బెనర్జీకు(Kalyan Banerjee (politician)) సైబర్ మోసగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంక్ అకౌంట్ నుండి ₹56 లక్షలు మాయం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, బెనర్జీ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోల్కతాలోని ఎస్బీఐ హైకోర్టు బ్రాంచ్లో ఓ సేవింగ్స్ అకౌంట్ తెరిచారు. ఆ అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్గా ఉండడంతో, దానిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. అనుమానితులు మార్ఫ్ చేసిన పత్రాలు, నకిలీ ఫోటోలు వాడి బ్యాంక్లో KYC అప్డేట్ చేసినట్లు నటించారు. అదే సమయంలో ఫోన్ నంబర్ మార్చి, అకౌంట్పై పూర్తి నియంత్రణ సాధించి, బెనర్జీ అకౌంట్ నుండి దాదాపు ₹56 లక్షల రూపాయలు ఖాళీ చేశారు.
Read also:Rashmika-Vijay Devarakonda Wedding : పెళ్లి ఏర్పాట్లలో రష్మిక బిజీ బిజీ ..!
MP ఫిర్యాదు, విచారణ ప్రారంభం
Cyber Fraud: ఈ మోసం విషయం తెలుసుకున్న వెంటనే కళ్యాణ్ బెనర్జీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్బీఐ అధికారులు కూడా అంతర్గత విచారణ చేపట్టారు. ఈ ఘటనపై బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్ దోచుకుంటారు, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు!” అంటూ ప్రభుత్వంపై వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఆయన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇనాక్టివ్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు సులభ లక్ష్యాలు అవుతాయి. కాబట్టి బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్లను సమయానుకూలంగా యాక్టివ్గా ఉంచి, KYC డేటాను స్వయంగా చెక్ చేసుకోవాలని సూచించారు.
కళ్యాణ్ బెనర్జీ ఎవరు?
ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, గతంలో వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
మోసం ఎలా జరిగింది?
నేరగాళ్లు నకిలీ పత్రాలు, మార్ఫ్డ్ ఫోటోలతో KYC అప్డేట్ చేసి, ఫోన్ నంబర్ మార్చి డబ్బు బదిలీ చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/