Crude oil price: యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బార్క్లేస్ బ్యాంక్ అంచనా ప్రకారం పరిస్థితులు కొనసాగితే బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరవచ్చు. దీంతో భారత్లో (India) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలతో సరఫరా అంతరాయం కలగవచ్చనే ఆందోళన ఉంది.
Read Also: Evacuation of Indian: గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన
భారత్పై భారం: లీటరుకు రూ. 10 పెరిగే ఛాన్స్?
ధర ఈ స్థాయికి చేరితే మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధర రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ చమురు ధర 120 డాలర్ల దాకా వెళ్లినప్పటికీ ఆ తర్వాత తగ్గింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు పట్టు ఉండటంతో చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన పెరిగింది.
దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు ఎగిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచితే మార్కెట్ పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
మనదేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతుంది. ఇందులో రెండు మిలియన్ బ్యారళ్లు హార్ముజ్ మీదుగానే వస్తోంది. క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా.. ఏటా ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం పడుతుంది. గత ఏడాది మనదేశం 160 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ను కొనుగోలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: