📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest news: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

Author Icon By Saritha
Updated: December 3, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో(Bangalore) ఓ తెలుగు(Crime) జంట మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకర పరిణామాలకు దారితీసింది. సహజీవనం చేస్తున్న ఈ జంటలో ప్రియుడు ముందుగా ప్రియురాలిని హత్య చేసి, అనంతరం తానే ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని నగరలో సోమవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. మరణించినవారిని లలిత (49), లక్ష్మీనారాయణ (51)గా గుర్తించారు.

Read also: విద్యుత్ ఛార్జీలు పెంపు పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

A fight between a Telugu couple led to unfortunate consequences.

పొరుగువారికి అనుమానం కిటికీ నుంచి బయటపడిన విషాదం

పోలీసులు(Crime) తెలిపిన వివరాల మేరకు లలితకు ఇప్పటికే కుటుంబం ఉండగా, వ్యక్తిగత సమస్యల కారణంగా బెంగళూరుకు వచ్చి ఉద్యోగం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణతో పరిచయం ఏర్పడి, అతి త్వరలోనే అది ప్రేమ సంబంధంగా మారింది. దాంతో ఇద్దరూ కలిసి గత ఎనిమిదినెలలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం పని ముగించుకొని ఇంటికి వచ్చిన వీరిద్దరూ మద్యం సేవించారని స్థానికులు తెలిపారు. దీనితో మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.

పోలీసుల అనుమానం ప్రకారం వాదన ఉదృతంగా మారడంతో లక్ష్మీనారాయణ, లలితపై దాడి చేసి ఆమె స్పృహ తప్పిన తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం అదే చీరతో అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు కిటికీ ద్వారా పరిశీలించగా ఇద్దరూ మృతి చెందినట్లు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల నిజమైన కారణాలు దర్యాప్తులో తెలుస్తాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bengaluru crime Domestic Violence Karnataka News Latest News in Telugu live-in couple murder suicide Police investigation on gold scam Telugu lovers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.