ధర్మస్థళ (Dharamsthala) లో చోటుచేసుకున్న మిస్టరీ హత్యలు ప్రస్తుతం రాష్ట్రం, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో ఇటువంటి ఘోరమైన సంఘటనలు వెలుగులోకి రావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ విషయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, గత కొన్నేళ్లుగా దాదాపు 500 మంది యువతులు, మహిళలు లైంగిక దాడికి గురై, అనంతరం హత్య చేయబడి పూడ్చిపెట్టబడ్డారు. ఈ మానవత్వాన్ని సిగ్గు పడే విధమైన ఘటనలు వెలుగులోకి రావడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది.నారాయణ (CPI Narayana) మాట్లాడుతూ, ధర్మస్థళ ట్రస్ట్ పూర్తిగా ఒకే కుటుంబం ఆధీనంలో ఉందని, ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ కు సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.
ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని
అయితే, ఈ ఆదాయాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన బదులు, అక్రమ కార్యకలాపాలకు దారి తీస్తున్నారని ఆయన విమర్శించారు. ట్రస్ట్ పై పూర్తి స్థాయి విచారణ జరిపి, దాన్ని ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ, “500 మందిపై హత్యాచారం చేసి, శవాలను పూడ్చిపెట్టారు. తవ్వకాలు జరపగా ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయి. ఇది దేవస్థానమా లేక శ్మశానమా?” అని ప్రశ్నించారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారని అదే వేరే ప్రభుత్వం ఉంటే అసలు ఈ విషయం బయటకు వచ్చేది కాదని అన్నారు.
సీపీఐ నారాయణ ఏ అంశాల్లో ఎక్కువగా స్పందిస్తారు?
ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, అవినీతి, రైతు సమస్యలు, సామాజిక అన్యాయాలపై ఎక్కువగా స్పందిస్తారు.
ఆయన రాజకీయ ధోరణి ఏమిటి?
వామపక్ష సిద్ధాంతాలను అనుసరిస్తూ, సామాజిక సమానత్వం, కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమం కోసం పోరాడుతుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :