రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో కరెన్సీ నోట్ల ముద్రణపై జరిగిన ఖర్చుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు రూ. 6,372.82 కోట్లు ఖర్చు అయిందని RBI తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికమని నివేదిక స్పష్టం చేసింది.
రూ. 500 నోట్లకే ఎక్కువ ప్రాధాన్యం
ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ (Currency Notes ) వాల్యూ 6 శాతం, నోట్ల క్వాంటిటీ 5.6 శాతం పెరిగినట్లు RBI తెలిపింది. వాల్యూ పరంగా చూస్తే రూ. 500 నోట్ల వాటా అత్యధికంగా 86 శాతంగా ఉంది. నోట్ల సంఖ్య పరంగా చూసినపుడు రూ. 500 నోట్ల వాటా 40.9 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. చిన్న నోట్ల కంటే పెద్ద నోట్లకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న దృశ్యాన్ని ఇది సూచిస్తోంది.
కొత్తగా ముద్రించని నోట్ల వివరాలు
2023-24 సంవత్సరంలో రూ. 2, రూ. 5, అలాగే ఇప్పటికే మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి తప్పించబడిన రూ. 2,000 నోట్లను కొత్తగా ముద్రించలేదని RBI స్పష్టం చేసింది. చలామణీలో ఉన్న ఈ నోట్ల వాటా తగ్గుతున్నదని, దాని ప్రకారం ముద్రణపై తగ్గింపులు వస్తున్నాయని అర్థమవుతుంది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న వేళ, కరెన్సీ ముద్రణపై భవిష్యత్లో మరింత నియంత్రణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Mahanadu : రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు – నారా లోకేష్