📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

దేశంలో కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణ!

Author Icon By Vanipushpa
Updated: February 13, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఓ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన విషయం తెలిసిందే. గెలుస్తుందనుకున్న రాష్ట్రాల్లో కూడా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
ఇప్పుడు ఎన్నికలు పెడితే …
గత ఎన్నికల్లో సెంచరీకి చేరువగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదని తేలింది. 542 స్థానాలకు గానూ కేవలం 78కే పరిమితమయ్యే అవకాశం ఉందని ఇండియా టుడే, సీఓటర్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పోల్‌ లో వెల్లడైంది.

ఎన్డీయేకు 300 పైచిలుకు సీట్లు

ఇక ఇదే సర్వేలో బీజేపీ కి ఆదరణ క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇందులో బీజేపీ సొంతంగా 281 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా 1,25,123 మందిని ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.

పని చేసిన అబ్ కి బార్ చార్ సౌ పార్ ..

2024 ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌.. 400 పార్‌’ అన్న నినాదంతో బీజేపీ ఊదరగొట్టిన విషయం తెలిసిందే. చివరికి 292 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే గెలిచింది. అయితే, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత ప్రస్తుతం బీజేపీ గణనీయంగా పుంజుకుందని, ఎన్డీయే కూటమికి ప్రజాదరణ పెరిగిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీ క్యాడర్‌లో జోష్ పెంచిందని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 343 సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని చెప్పింది. ఇక మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి (కాంగ్రెస్‌కు సొంతంగా 99) ప్రస్తుతం 188 సీట్లను దక్కించుకుంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రాభవం పడిపోతోందని పేర్కొంది.

Breaking News in Telugu congess Google News in Telugu india today Latest News in Telugu Paper Telugu News Survey Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.