📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఖాతా తెరవనున్న కాంగ్రెస్

Author Icon By Sharanya
Updated: February 12, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా వెనుకంజలోనే కొనసాగుతుండగా ఒక్క బాద్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాద్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు ‘‘ఫలితాలు నాకు తెలియదు, నేను ఇంకా ఫలితాలను చూడలేదు’’ అని ప్రియాంక అన్నారు.

ఓట్ల లెక్కింపుకు ముందు, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీ మార్పును కోరుకుంటుందని, ఎన్నికల ఫలితాలతో ఈ మార్పు జరగబోతోందన్నారు. పదేళ్ల క్రితం ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.’’ అల్కా లాంబా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుహ్యంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, పార్టీ జాతీయ కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సేవలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆమె కుమారుడిని బరిలో నిలిపినా ఉపయోగం లేకుండా పోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యం
కొనసాగుతున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు

Breaking News in Telugu congress delhi Election Results Google News in Telugu Latest News in Telugu Paper Telugu News RahulGandhi sonia gandhi Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.